ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి అస్వస్థత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 04:26 PM

అసెంబ్లీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సభలో ఉన్న సమయంలో కోటంరెడ్డి బీపీ లెవల్స్ పెరగడంతో ఆయన బయటికొచ్చి వైసీపీఎల్సీ ఆఫీసుకు వెళ్లారు. వైద్యులు అక్కడ ఆయనను పరీక్షించిన తర్వాత దగ్గర్లోని ఆస్పత్రికి ఆయనను సిబ్బంది తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడా ఉంది. దీని పై సీఎం జగన్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరా తీశారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పడంతో సభలో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com