ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉల్లి షాక్‌ నుంచి ఉపశమనం!

national |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 07:26 AM

నాలుకకు రుచి తగలాలంటే ఆ వంటలో ఉల్లిపాయ ఉండాల్సిందే. కానీ ఉల్లిపాయ రేట్లు కొండెక్కి కూర్చోవడంతో వంటల్లో వాటిని బ్యాన్‌ చేశారు. దీంతో ఉల్లి లేని వంటలు తినలేక భోజనప్రియులు బిక్కమొహం వేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఉల్లిపాయ మ్యూజియంలో వస్తువులా మారిపోయినట్టు కనిపిస్తోంది. ఉల్లిపాయ రేట్లు చూసి సామాన్య జనం కళ్లు తేలేస్తున్నారు. కొనకముందే ఏడ్పించేస్తున్న ఉల్లిపాయలను కొంతమంది బాగానే క్యాష్‌ చేసుకుంటున్నారు. అదెలాగంటే.. తమిళనాడులోని పట్టుకొటై్ట ప్రాంతంలో ఉన్న ఎస్‌టీఆర్‌ మొబైల్‌‌స దుకాణం వినియోగదారులకు ఉచితంగా కిలో ఉల్లిపాయలు ఇస్తోంది. కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. మీకు ఉల్లిపాయలు కావాలంటే ముందుగా ఆ దుకాణంలో ఓ స్మార్‌‌టఫోన్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో స్మార్‌‌టఫోన్‌కు ఒక కేజీ ఉల్లి ఉచితం. ఈ ఐడియా బాగానే వర్కవుట్‌ అయినట్లు కనిపిస్తోంది. కేజీ ఉల్లిపాయ ఆఫర్‌తో జనాలు మొబైల్‌ షాపు ముందు క్యూ కడుతున్నారని దుకాణ యజమాని శరవనకుమార్‌ చెప్పుకొచ్చాడు. ఈ ఆఫర్‌తో షాపుకు వినియోగదారుల తాకిడి పెరిగిందన్నారు. సాధారణ రోజుల్లో రోజుకు మూడు, నాలుగు మాత్రమే ఫోన్లు అమ్మేవాడిని. కానీ ఈ ఆఫర్‌ తర్వాత 10 అంతకు పైనే స్మార్‌‌టఫోన్లు అమ్ముడవుతున్నాయి అని చెప్పాడు. ఇక షాపుకు వచ్చినవాళ్లు స్వయంగా వారే ఉల్లిపాయలను ఏరుకుని మరీ తీసుకెళ్లవచ్చట. కాగా తమిళనాడులో ఓ జంట వివాహానికి హాజరైన అతిథులు బకెట్‌ ఉల్లిపాయలు గిఫ్‌‌టగా ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో జనం వాటిని కొనాలంటేనే భయపడుతున్నారు. రాజకీయ నాయకుల నిరసనల్లో ఉల్లిని బంగారంతో పోలుస్తూ ప్రభుత్వాలు ధరలను కంట్రోల్‌ చేయలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు. అయితే సీఎంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఆయన కేవలం కాంగ్రెస్‌ కార్యకర్తలకు మాత్రమే సీఎం కాదని, ఉల్లి ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న పేదలను పట్టించుకోవాలని డిమాండ్‌ చేశాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com