ఇది రైతు ప్రభుత్వం రైతుల శ్రేయోభి లాసి వైస్సార్సీపీ ప్రభుత్వం అని రైతన్న కు వెనుదన్నుగా ఉంటూ రైతే రాజుగా చూడలన్నదే సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ మహిళ సమన్వయ కర్త పిరియా విజయ తెలిపారు. బుధవారం ఉప్పాలం పంచాయతీలో రైతులకు కొబ్బరిమొక్కలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… రైతన్నను రాజుగా తీర్చిదిద్దే ఆశయంతో జగనన్న ప్రభుత్వం ముందు కెళ్తుందని విజయ కొనియాడారు.. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు నర్తు.రామారావు, ఇప్పిలి. కృష్ణారావుతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.