ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమ వేధింపులు తాళలేక.. ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 01:07 PM

కడప జిల్లా, పెనగలూరు మండలంలోని కొండూరు పంచాయతీ గట్టువారిపల్లెకు చెందిన ఉప్పు హరిత (18) ప్రేమ వేధింపులతో ఆదివారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  వివరాలిలావున్నాయి. హరిత రాజంపేటలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే పంచాయతీ సిరివరం గ్రామానికి చెందిన ఓ యువకుడు రాజంపేటలోనే డిగ్రీ చదువుతున్నాడు. ఈనేపథ్యంలో ఇద్దరూ ఒకే బస్సులో కళాశాలలకు వెళ్లి వచ్చేవారు. ఆ యువకుడు ప్రతి రోజూ హరితను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్ళి చేసుకుంటానని వెంటపడేవాడు.


విషయం విద్యార్థిని బంధువులకు తెలిసి తమ అమ్మాయిని వేధించవద్దని హెచ్చరించారు. అయినా అతడు వెంటపడుతుండటంతో వేధింపులు తాళలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు.  మృతురాలి తల్లిదండ్రులు ఈశ్వరయ్య, లక్ష్మీదేవిలు జీవనోపాధికోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లి ఉన్నారు. కుమార్తె మృతి విషయాన్ని తెలుసుకొని తల్లిదండ్రులు సోమవారం స్వగ్రామాని చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. మృతిరాలి తండ్రి ఈశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హేమీభాయి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com