ఇస్లామాబాద్ : గురు నానక్ 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా పాకిస్తాన్లోని నన్కానా సాహిబ్ను దీపాలతో అలంకరించారు. భారత్నుంచి, ఇతర దేశాలనుంచి వేలాదిమంది సిక్కు మతస్థులు ఈ నన్కానా సాహిబ్ను దర్శించుకోనున్నారు. కర్తార్పూర్ సాహిబ్ను సందర్శించడానికి భారతీయులకు వీసా, పాస్పోర్టు అవసరం లేదని, గుర్తింపు ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుందని పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది.