రాష్ట్ర విభజన తర్వాత 2015లో . విశాఖ-కొత్త ఢిల్లీ మధ్య నడిచేలా ప్రారంభించిన ఏపీ ఎక్స్ప్రెస్ వేళల్లో మార్పు చేస్తూ రైల్వేశాఖ కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. గత కొంత కాలంగా రైలు వేళలు మార్పు చేయాలంటూ వస్తున్న డిమాండ్ నేపథ్యంలో అధికారులు పరిశీలించి రైల్వేశాఖకు సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. ఏపీ ఎక్స్ప్రెస్ కొత్త షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరి 23 నుంచి అమల్లోకి రానుంది. ఆ తేదీ నుంచి ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు విశాఖలో బయలుదేరి . దాదాపు ముప్పై రెండున్నర గంటల ప్రయాణం తర్వాత మూడో రోజున ఉదయం 6.35 కొత్త ఢిల్లీ చేరుతుంది. అలాగూ. ప్రతిరోజూ కొత్త ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8.15 గంటలకి బయలుదేరి మూడో రోజు ఉదయం 5.05 గంటలకు విశాఖ చేరుతుంది. కొత్త షెడ్యూల్లో ప్రయాణ కాలాన్ని దాదాపు రెండుగంటల వరకు తగ్గించారు.