వివాదాస్పద నేరగాళ్ల అప్పగింత ముసాయిదాపై హాంకాంగ్ ప్రభుత్వం ముసాయిదాను ఉపసంహ రించి నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధ వారం సెక్రటరీ ఫర్ సెక్యూరిటీ జాన్ లీ ఓ ప్రకట విడుదల చేస్తూ నేరగాళ్లను అవసరాన్ని బట్టి విచారణ నిమిత్తం చైనాకు అప్పగింతకు ప్రభుత్వం ము సాయిదాను ప్రతిపాదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ లక్షల మంది పౌరులు గత కొన్ని నెలలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దరిమిలా ప్రభుత్వం ముసాయిదాను తాత్కాలికంగా ఆపింది. అయితే దీన్ని పూర్తిగా ఉపసంహరించాలని ప్రజలు మరోసారి చేపట్టిన ఆందో ళన ఉగ్రరూపాన్ని దాల్చడంతో ఎట్టకేలకు హాంకాంగ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
నేరస్థుల విష యంలో పదే పదే ఎదుర వుతున్న ఇబ్బందుల దృష్ట్యా హాంకాంగ్ ఈ ముసాయిదాను ప్రతిపాదించింది. హాంకాంగ్ కు చెందిన వ్యక్తి ఒకరు గర్భవతి అయిన తన ప్రియురాలిని గతేడాది ఫిబ్రవరిలో తైవాన్కు తీసుకెళ్లి అక్కడ ఆమెను హత్య చేసి, తప్పించుకుని తిరిగి హాంకాంగ్ వచ్చేశాడు. దీంతో ఈ కేసు విచారణ చేస్తున్న తైవాన్ పోలీసులు నిందితుడిని తమకు అప్పగించాలని ప్రభుత్వానికి నివేదిచగా తైవాన్ ప్రభుత్వం హాంకాంగ్ కోరింది. నేరస్తుల అప్పగింత గురించి తైవాన్తో ఒప్పందాలు లేనందున హాంగ్ కాంగ్ అందుకు నిరాకరించిన విషయం విదితమే.