న్యూఢిల్లీ: దేశంలో బ్యాంకులు ఈరోజు దీన స్థితికి చేరడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగే కారణమని ప్రస్తుతం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు.ఇండియన్ బ్యాంకుల గురించి ఆవేదనతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నిర్మలా బ్యాంకుల దీనస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, అప్పటి ప్రధాని మన్మోహన్, రఘురాం రాజన్ అందుకు బాధ్యులన్నారు. వారి హయాంలోనే ఇష్టారీతిన లోన్లు ఇవ్వడంతో బ్యాంకులకు ఈ దుస్థితి దాపురించిందన్నారు.