మాజీ ప్రధాని రాజీవ్గాంధీ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. హైదరాబాద్లోని సోమాజిగూడలో జరిగిన రాజీవ్గాంధీ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. రాజీవ్గాంధీ ప్రవేశపెట్టిన టెక్నాలజీ వల్లనే భారత్ అగ్రభాగాన ఉందన్నారు. చరిత్రను కనుమరుగు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. త్యాగమూర్తుల చరిత్ర భావితరాలకు అందించాలన్నారు. రాజీవ్గాంధీ స్థానిక సంస్థలకు అధికారులు ఇచ్చారన్నారు. దేశంలో క్రీడలను రాజీవ్ ప్రోత్సహించారని కొనియాడారు.