ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగానే.. డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి నామినేషన్ ఒక్కటే మాత్రమే దాఖలు కావడం... నామినేషన్కు గడువు ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసిపోవడంతో... ఆయన డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, రేపు సభలో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారు. ఇక, గతంలో కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు స్పీకర్గా పనిచేశారు. రేపు ఉదయం 11 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సాయంత్రం 5 గంటటల వరకు నామినేషన్ల దాఖలుకు సమయం కేటాయించారు. అయితే నిర్ధేశిత సమయంలోగా వైసీపీ నుండి కోన రఘుపతి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. కోన రఘుపతిని బలపరుస్తూ 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.