ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఎన్నిక ఏకగ్రీవం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 17, 2019, 07:44 PM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగానే.. డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి నామినేషన్ ఒక్కటే మాత్రమే దాఖలు కావడం... నామినేషన్‌కు గడువు ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసిపోవడంతో... ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, రేపు సభలో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారు. ఇక, గతంలో కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు స్పీకర్‌గా పనిచేశారు. రేపు ఉదయం 11 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సాయంత్రం 5 గంటటల వ‌ర‌కు నామినేషన్ల దాఖ‌లుకు స‌మ‌యం కేటాయించారు. అయితే నిర్ధేశిత స‌మ‌యంలోగా వైసీపీ నుండి కోన ర‌ఘుప‌తి మాత్ర‌మే నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కోన రఘుపతిని బలపరుస్తూ 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com