ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ విలీనానికి ఆంజ‌నేయులు క‌మిటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2019, 09:26 PM

APSRTC విలీనం దిశలో తొలి అడుగు పడింది. ఆరుగురు సభ్యులతో అధ్యయన కమిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు జూన్ 14వ తేదీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి సి.ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ పనిచేయనుంది. ఇందులో మరో ఐదుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలీనానికి సంబంధించి ప్రక్రియ, ఇందులో ఎదురయ్యే సమస్యలు..వాటిని ఎలా పరిష్కరించాలి..ఆర్టీసీలో పనిచేసే సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలు..పూర్తి వివరాలను కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఓ రిపోర్టు అందివ్వనుంది. మరోవైపు ఏపీఎస్‌ ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టడం కోసం ఇదే జీవోలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశ పెడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి..వీటి సాధ్యసాధ్యాలపై సభ్యులు అధ్యయనం చేయనున్నారు. మొత్తంగా కమిటీ సభ్యులు మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com