కుందుర్పి మండలం వడ్డేపాళ్యం గ్రామంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచార రథంపై రాళ్లు రువ్విన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతుండగా వైసీపీ అల్లరి మూకలు రాళ్లు రువ్వడంతో అది అభ్యర్థికి కాకుండా వీరేష్ అనే చిన్నారికి తగిలి గాయమైందన్నారు. టిడిపికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నాయకులే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారన్నారు.