రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్న దశలో ప్రమాణ స్వీకారం చేయకుండానే కొందరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరమవుతారంటూ సామాజిక మీడియాలో కథనాలు పార్టీ వర్గాలలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో టిఆర్ ఎస్కి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ విపక్షం లేకుండా చేసే లక్ష్యంతో టిఆర్ ఎస్లోకి కాంగ్రెస్ శాసన సభ్యులను రప్పించినట్టే. ఏపిలో టిడిపి శాసనసభ్యులను వైసీపిలోకి కాకుండా బిజెపిలోకి పంపాలని వైసిపి సంప్రదింపులు జరుతున్నట్టు వినవస్తోంది. వైసిపిలోకి వెళితే రాజీనామాల నిబంధన, ఓ వేళ చేసినా తిరిగి గెలుస్తామన్న ధీమా లేక పోవటంతో బిజెపిలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు బిజెపి వర్గాలే చెపుతున్నాయి. ఇప్పటికే పలువురు శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయకముందే బాబుకు టచ్లో లేకుండా పోయారని, దీంతో టీడీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారనేది సవశయమేనంటూ కథనాలు వెల్లువెత్తుతున్నాయి.