రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆంధ్రప్రదేశ్ క్యాడర్ 2017 బ్యాచ్కు చెందిన ఐదుగురు ట్రైనీ ఐఎఎస్లు బుధవారం ఆయన కార్యాలయంలో కలిశారు. విశాఖ, తూర్పు, పశ్చిమ, అనంతపురం, కడప జిల్లాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రైనీ ఐఎఎస్ల సేవలను కేంద్ర ఎన్నికల సంఘం వినియోగించుకుంది. ఎన్నికల నిర్వహణ, తాగునీటి కల్పనలో ఆయా జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు గురించి ట్రైనీ ఐఎఎస్లను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల పాటు సచివాలయం పనితీరుపైనా, అనంతరం పలు శాఖల విధివిధానాలపైనా అధ్యయనం చేయనున్నట్లు సీఎస్కు ట్రైనీ ఐఎఎస్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ట్రైనీ ఐఎఎస్లు గోపాల్ కృష్ణ, దినేష్కుమార్, ప్రవీణ్ ఆధిత్య, ద్యాన్చంద్, విశ్వనాథన్ పాల్గొన్నారు.