రాష్ట్ర వ్యవహారాలపై రిటైర్ట్ ఐఏఎస్ ల తీరు భిన్నంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత ఏపి సిఎం చంద్రబాబు నాయుడు. బుధవారం తన కార్యాలయంలో మీడియాలో మాట్లాడుతూ, సీఎస్, ఎస్పీలను అకారణంగా ఈసీ బదిలీ చేస్తే కించత్ మాట్లాడని మాజీ ఐఏఎస్ జగన్ కేసులో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నట్టు తను చెపితే తనని విమర్శిస్తున్నారని, గవర్నర్కి ఫిర్యాదు చేస్తారని, ఎవరు ఎందుకు ఎవరికి వంతపాడుతున్నారో జనం అర్ధం చేసుకోలేని అమాయకులు కాదని అన్నారు. ఏపీలో పని చేస్తే.. ఏం జరుగుతుందో రిటైర్డ్ ఐఏఎస్ లకు తెలుస్తుంది కానీఏపికి దూరంగా హైదరాబాద్ లో కూర్చుని విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.
మోడీ చెప్పినట్టే ఈసీ పని చేస్తోందని మరోమారు ఆరోపించారు ప్రధాని మోడీ తనకు వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై రాజకీయ కక్ష సాధిస్తున్నారనిభగ్గుమన్నారు. ఈసీ ఫ్లయింగ్ స్క్కాడ్ . కర్నాటక, ఒడిశా సీఎంల హెలికాప్టర్లను మాత్రం తనిఖీలు చేసారని, ప్రతిపక్షాలకు చెందిన సీఎంల హెలికాప్టర్లలో మాత్రమే తనిఖీలు చేసి. బీజేపీ సీఎం లహెలికాప్టర్ ను ఎందుకు తనిఖీ చేయరని, ప్రధాని మోడీ హెలికాప్టర్ ను తనిఖీ చేశారా? అని చంద్రబాబు ఈసి అధికారులను ప్రశ్నించారు.