వైసీపీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత సీఎం జగన్ తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గురించి సీఎం జగన్ మాట్లాడారు. తన మాటలు కఠినం కానీ మనస్సు మాత్రం వెన్న అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని, అనంతపురం ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర్ నారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.