తిరువనంతపురం: దేశానికి మోదీ చేసిందేమి లేదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఆయన వయనాడ్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తనను ఇక్కడ ప్రజలు సోదరుడిగా, కుమారుడిగా ఆదరించాలని కోరారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ వలే అబద్ధాలు చెప్పలేనని అన్నారు. ప్రచారానిక ముందు రాహుల్ తిరునెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.