ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్బులు పంచుతూ దొరికిన సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2019, 12:18 PM

తమిళనాడు: ఎన్నికల వేళ ఓటర్లకు డబ్బులు పంచడం సహజం. కాని ఇక్కడ స్వయానా ఓ సీఎం డబ్బులు పంచడం అంటే మామూలు విషయం కాదు కదా. ఎవరా సీఎం అనుకుంటున్నారా..తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. పళనిస్వామి ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. మంగళవారం రెండోవిడత ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లకు ఆయన పాంప్లెట్లతోపాటు డబ్బులు కూడా పంపిణీ చేశారు. ఓ పండ్ల దుకాణం వద్దకు వెళ్లిన పళనిస్వామి అక్కడున్న మహిళతో మాట్లాడుతూ తమకు ఓటేయాలని కోరారు. సీఎం తన వద్దకు రావడంతో ఆమె ఆనందంగా అరటిపండ్లు ఇచ్చింది. అవి తీసుకున్న పళనిస్వామి పాంప్లెట్లలో డబ్బులు పెట్టి తమ పార్టీ అభ్యర్థికి ఓటేయాల్సిందిగా అభ్యర్థించారు. మహిళకు సీఎం డబ్బులు ఇస్తున్న దృశ్యం కెమెరాకు చిక్కి అనంతరం సోషల్ మీడియాకు ఎక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com