శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలం లో టీడీపీ సీనియర్ నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలాస వైఎస్సార్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పాతపట్నం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు మిర్యాబెల్లి శ్యాంసుందర్ చేరారు. వారికీ పార్టీ కండువాను కప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.