ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రానికి ఐదు జలశక్తి అవార్డులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 08:24 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఐదు జలశక్తి అవార్డులను స్వీకరించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ రోజు ఢిల్లీలో అవార్డులను స్వీకరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జలశక్తి అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తొమ్మిది విభాగాల్లో 38 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు విభాగాల్లో ఐదు అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కాయి. దక్షిణ జోన్‌లో ఉత్తమ జిల్లాగా విశాఖపట్టణం, ఉత్తమ గ్రామపంచాయితీగా అనంతపురం జిల్లాలోని హంపాపురం ఎంపిక చేశారు. నీటిని పొదుపుచేసిన ఉత్తమ విద్యాసంస్థల క్యాటగిరీలో కేఎల్‌యూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, తిరుపతి ఐఐటి, విశాఖపట్టణంలోని తిరుమల నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు అవార్డు వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com