ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేరస్తులుపై కఠిన చర్యలు తీసుకుంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 08:13 PM

తెనాలి యువతి సహనా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. సహనా కోసం ప్రభుత్వ వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సహనా విషయంలో వైసీపీ రాజకీయ రంగు పులమడం సిగ్గుచేటు అన్నారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు.


వైసీపీ హయాంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆలపాటి రాజా మండిపడ్డారు. బాధితులకు సహాయం అందడం లేదని వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.. రాష్ట్రంలో జగన్ రెడ్డి విద్వేషాలు సృష్టించాలని చూస్తే చంద్రబాబు చూస్తూ కూర్చోరని హెచ్చరించారు, జగన్ రెడ్డి గుంటూరు పర్యటన చేస్తే ఏమైనా భూమి బద్దలవుతుందా అని నిలదీశారు. సహనా విషయంలో నేరస్తులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సహనా కుటుంబ సభ్యులకు టీడీపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆలపాటి రాజా హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com