ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 07:24 PM

జాతీయరహదారిపై పైడిబీమవరం అమ్మవారి ఆలయం సమీపాన శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రణస్థలం, పూసపాటిరేగ గ్రామానికి చెందిన మురళీ రాజు (38) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పైడిభీమవరం లోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్న మరళీరాజు విధులు ముగించుకుని ద్విచక్ర వాహ నంపై స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ వస్తుండగా.. అమ్మవారి గుడి సమీపాన కుక్క అడ్డంగా రావడంతో అదుపుతప్పి పడిపోయాడు. ఈ ఘటనలో ము రళీరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జేఆర్‌ పురం ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com