ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 05:42 PM

శుక్రవారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి పదవీ స్వీకార సభ జరిగింది. ఈ సందర్భంగా పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా ప్రతి నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.


ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఏడు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. మచిలీపట్నం పోర్ట్‌ మాజీ డైరెక్టర్‌ మేకతోటి దయాసాగర్‌ మాట్లాడుతూ పార్టీని తిరిగి నిర్మించుకునేందుకు జిల్లా నాయకత్వంతో కలిసి ముందుకు సాగుదామన్నారు. పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి దొంతిరెడ్డి, వేమారెడ్డి మాట్లాడుతూ ఈ సభ చూస్తుంటే యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని సంకేతం ఇచ్చినట్లు ఉందన్నారు. పార్టీ నేత గంజి చిరంజీవి మాట్లాడుతూ నాలుగున్నరేళ్లు ప్రజల సమస్యలపైనే పోరాటం సాగించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com