ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన దుస్తుల అలంకరణలపై ఉచిత శిక్షణా కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 02:57 PM

దేశ వ్యాప్తంగా రైల్వేకోడూరు మండలం లక్ష్మీగారిపల్లెలో తయారు అవుతున్న రాజురాణి బొమ్మలకు విశేష ఆదరణ ఉందని తిరుమల లేపాక్షి మేనేజర్‌ వెంకటేశం తెలిపారు. లక్ష్మీగారిపల్లెలో ఈ ఏడాది జూలైలో రాజురాణి బొమ్మలకు వివిధ రకాల దుస్తుల అలంకరణలపై మహిళలకు ఇస్తున్న ఉచిత శిక్షణా కార్యక్రమం సోమవారంతో ముగిసింది.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ హస్తకళల అభివృద్ధి సంస్థ రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల హస్తకళా వస్తువులకు తగిన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించిందన్నారు. అందులో భాగంగా వివిధ రకాల హస్తకళలకు సంబంధించి కళాకారులకు తగిన న్యూ డిజైన, కళల పట్ల పట్టు సాధించ డానికి ఏపీ హస్తకళల అభివవృద్ధి సంస్థ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సునీత, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఎగ్జిక్యూ టీవ్‌ డైరెక్టర్‌ విశ్వ ఆదేశాల మేరకు అనేక శిక్షణా కార్యక్ర మాలను ఏర్పాటు చేస్తుందన్నారు.


ఇందులో భాగంగా లక్ష్మీ గారిపల్లెలో రాజురాణి బొమ్మలకు దేశంలోనే విశేష ఆదరణ ఉందన్నారు. ప్రధానంగా రాజురాణి బొమ్మలకు వివిధ రకాల దస్తుల అలంకరణ చేసే పద్ధతిని కొత్తగా తీసుకుని వచ్చామని తెలిపారు. వీటికి విపరీ తంగా గిరాకీ ఉందన్నారు. ప్రత్యేకంగా ప్రావీణ్యం కల్గిన ఒక మాస్టారును పెట్టి మొదటి విడతగా 20 మంది కళాకారులను ఎంపిక చేసి 2 నెలల పాటు శిక్షణ ఇచ్చారని తెలిపారు. కార్య క్రమంలో శిక్షకురాలు శ్రీదేవి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బి.నాగరాజు ప్రసాద్‌, శెట్టిగుంట సర్పంచ శివశైలజ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com