ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 02:33 PM

విజయనగరం జిల్లా, రేగిడి మండలంలోని పెద్దశిర్లాం గ్రామానికి చెందిన చెరికూరి శంకరరావు(50) సోమవారం చికిత్సపొందుతూ మృతిచెందాడు. స్థానికుల కథనం మేర కు.. పెద్దశిర్లాం గ్రామానికి చెందిన చెరికూరి శంకరరావు టింపర్‌డిపోలో కార్మికు డిగా, గ్రామంలో కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఈనేపథ్యంలో గతనెల 27 రాత్రి పెద్దశిర్లాం ఊరు శివార్లో పురుగులు మందుతాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న శంకరరావును అదేరోజు కుటుంబ సభ్యులు రాజాం ఆసుపత్రికి చేర్పించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.


అక్కడ సోమవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతిచెందాడు. శంకరరావుకు భార్య రుక్మిణి, కుమార్తె చరిష్మ ఉన్నారు. ఈ ఘటనపై సమచారం అందినట్లు ఏఎస్‌ఐ రాజారావు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేస్తామని, మంగళవారం పోస్టుమార్టం చేస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com