ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్

national |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 03:28 PM

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రులైన ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఫామ్-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈసీ సూచించింది. నవంబర్ 23న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించనుంది. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, అదే నెల 30న తుది జాబితాను వెల్లడించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com