ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుడమేరు గురించి జగన్ కి ఏమి తెలుసు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 09:26 PM

మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాగుకు, నదికి తేడా తెలియదని మైలవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విమర్శించారు. మిడి మిడి ఙ్ఞానంతో అవగాహన రాహిత్యంతో విమర్శలు చేశారని అన్నారు. బుడమేరు గురించి జగన్‌కు ఏమాత్రం అవగాహన లేదని విమర్శలు చేశారు. మైలవరం మండలంలోని చంద్రాల గ్రామంలో ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఇటీవల బుడమేరు ముంపునకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విమర్శించారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద బుడమేరు పరిస్థితిని అధికారులతో పర్యవేక్షించానని వివరించారు. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తకపోతే ఆ ప్రాంతంపై ప్రభావం చూపేదన్నారు. గేట్లు ఎత్తే సమయానికే 4.5 అడుగులమేర వరద నీటి ప్రవాహం వచ్చిందన్నారు. గేట్లు ఎత్తకపోతే నాలుగైదు గ్రామాల్లో వందల సంఖ్యలో మరణాలు సంభవించి ఉండేవని చెప్పారు. నిజాలను వదిలేసి బ్లూ మీడియా సాక్షిలో ఇష్టారాజ్యంగా ప్రేలాపనలు పేలుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com