ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఉక్కును తుక్కు కింద మార్చారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 02:20 PM

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో విశాఖ ఉక్కును తుక్కు కింద మార్చేశారని అన్నారు. అలాగే, పురుషులందు ఈ దుర్మార్గపు చంద్రబాబు వేరయా అని చెప్పుకోవాలి అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు.


ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా.. చంద్రబాబు 100 రోజుల పనితీరు పార్ట్-2 పేరుతో..


100 రోజుల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. 100 రోజుల్లో 60 అత్యాచారాలు జరిగాయి.100 రోజుల్లో విజయవాడలో "ఐరన్ లెగ్" పాలనలో వరదల్లో 60 మందిని చంపేశారు . వరద బాధితులకు కనీస సహయ సహకారాలు కూడా అందించలేదు. బాబు ఫోటోషూట్ తప్ప. 100 రోజుల్లో గుడ్లవల్లేరు కాలేజీ మహిళ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి 3 వేల వీడియోలు తీసారు. 100 రోజుల్లో విశాఖ ఉక్కు ను తుక్కు కింద మార్చేశారు.వైజాగ్  ఆర్థిక వెన్ను ను చంద్రబాబు ప్రభుత్వం విరిచేసింది. విశాఖ ఉక్కు కార్మిక ఉద్యమ తుఫానులో చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయం. అమరావతి వరదముంపులో ఇల్లు లేక కలెక్టర్ ఆఫీసు లో తలదాచుకున్న బాబుకు అదికూడా మిగలదు. 100 రోజుల్లో పోలవరాన్ని నాశనం చేశారు.100  రోజుల్లో అమరావతిని మునిగి పోకుండా ఉండటానికి ప్రకాశం బ్యారేజీని టిడిపి నేత బోట్లతో గుద్దించారు.100 రోజుల్లో మెడికల్ కాలేజీ లను నాశనం చేశారు.100 రోజుల్లో సచివాలయ వ్యవస్థను నాశనం చేశారు.100 రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను నాశనం చేశారు.100 రోజుల్లో రేషన్ వాహనాలు నాశనం చేశారు. 100 రోజుల్లో 10 వ్యాపార కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారు. 100 రోజుల్లో  రోడ్లను నాశనం చేశారు, గుంతలపై తట్ట మట్టి కూడా వేయలేదు. 100 రోజుల్లో ప్రత్యర్థి రాజకీయ నేతలపై పదివేల దాడులు చేశారు. 100 రోజుల్లో రాష్ట్రాన్ని నేరమయం చేశారు , నేరాలు దారుణంగా పెరిగిపోయాయి.100 రోజుల్లో 40వేల కోట్ల అప్పులు చేశారు.100 రోజుల్లో  మొత్తంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని దుయ్యపట్టారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com