ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 06:50 PM

మనస్తాపంతో వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజాం మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ రవికిరణ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన మరడాన శివ (31) ఈనెల మొదట్లో రాజాంలో టిఫిన్‌ షాపు పెట్టాడు. అయితే వ్యాపారం సక్రమంగా నడవకపోవడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మనస్తాపం చెందాడు. దీంతో శనివారం రాత్రి మొగిలివలస గ్రామ సమీపంలోని టేకుతోటలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శివ తండ్రి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రవికిరణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com