ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ, వైసీపీ యువకులమధ్య ఘర్షణ, పలువురికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 04:59 PM

ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. స్థానిక వైసీపీ నేతలు టీడీపీకి చెందిన యువకులపై దాడికి యత్నించారు. ఘర్షణలో టీడీపీకి చెందిన బోయ ఆంజనేయ, బోయ రవి, బోయ నరసింహులు, బొజ్జక్క తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన ఎమ్మిగనూరు ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరువర్గాల ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. గత మూడు నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం. ఇకనైనా దాడులు మానేసి వైఫల్యాలపై దృష్టి పెట్టాలని వైసీపీ నేతలకు తెలుగు తమ్ముళ్లు హితవు పలుకుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com