ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వేకువజామున క్యూ లైన్లో గుండెపోటుకు గురైన భక్తురాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 04:03 PM

సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఝాన్సీ (32) మహిళ హఠాన్మరణం చెందింది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్ లో నిలుచున్న ఆ భక్తురాలు గుండెపోటుతో కుప్పకూలింది. వెంటనే స్పందించిన ఇతర భక్తులు సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న స్థానిక వైద్య సిబ్బంది అంబులెన్స్ తో వచ్చారు. నర్సులు కూడా సీపీఆర్ చేసినా ప్రయోజనం కనిపించలేదు. ఆ భక్తురాలిని ఆసుపత్రికి తీసుకెళుతుండగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో ఈ వేకువ జామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగింది. మృతి చెందిన భక్తురాలి స్వస్థలం కడప అని గుర్తించారు. ఆమె లండన్ లో స్థిరపడినట్టు తెలిసింది. ఝాన్సీ అకాలమరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలికి కవల పిల్లలు ఉన్నారు. కాగా, అంబులెన్స్ రాక ఆలస్యమైందని, క్యూలైన్ లో కనీసం సమాచారం అందించేందుకు ఫోన్ సౌకర్యం కూడా లేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com