ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలికపై మంత్రగాడు అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 05:14 PM

శ్మశానవాటిక సమీపంలో నివసించే మంత్రగాడు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అనారోగ్యంతో ఉన్న ఆమె తండ్రి చనిపోతాడని బెదిరించాడు. బాలిక అస్వస్థత చెందటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. క్షుద్ర పూజలు చేసే 52 ఏళ్ల మహ్మద్ షరీఫ్‌, కంఝవాలాలోని శ్మశాన వాటిక సమీపంలో నివసిస్తున్నాడు. మంత్రగాడిగా, భూతవైద్యుడిగా స్థానికంగా ప్రచారం పొందాడు.కాగా, భార్య చనిపోయిన ఒక వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కలిసి కంఝవాలా ప్రాంతంలో నివసిస్తున్నాడు. కూరగాయలు అమ్మి జీవించే అతడు ఆగస్ట్‌ 26న అనారోగ్యానికి గురయ్యాడు. భూతవైద్యుడు మహ్మద్ షరీఫ్ అతడి ఇంటికి వచ్చి పరిశీలించాడు. పూజలు చేయాలన్న అతడు బాలికతో బియ్యం పంపాలని చెప్పాడు.మరోవైపు ఏడేళ్ల కుమార్తె వెంట కుమారుడ్ని కూడా ఆ వ్యక్తి పంపాడు. కొంత సమయం తర్వాత ఆ బాలుడు ఇంటికి తిరిగి వచ్చాడు. పూజల కోసం సోదరిని ఆ మంత్రగాడు తన వద్ద ఉంచుకున్నట్లు తండ్రికి చెప్పాడు. కొన్ని గంటల తర్వాత ఆ బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. అయితే మౌనంగా ఉన్న ఆమె ఆ మరునాడు అస్వస్థతకు గురైంది. బాలికను హాస్పిటల్‌కు తరలించగా ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు డాక్టర్లు గుర్తించారు.కాగా, బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నకిలీ మంత్రగాడైన మహ్మద్ షరీష్‌ను అరెస్ట్‌ చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన అతడు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అనారోగ్యంతో ఉన్న ఆమె తండ్రి చనిపోతాడని బెదిరించినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. అలాగే ఆ బాలికకు రూ.51 నగదును ఆ భూత వైద్యుడు ఇచ్చినట్లు చెప్పారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com