ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నేతలు మహిళల జీవితాలు నాశనం చేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 01:08 PM

వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం చూశామని... గంట, అరగంట మంత్రులు ఏమన్నారో చూశామన్నారు. ఇప్పుడు సకలశాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని అన్నారు. జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు ఎంత తేడా ఉందో చూడాలన్నారు. జగన్, వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీ ఇన్నీ కావని మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్రా అని కోట్లు దోచుకున్నార న్నారు. ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నటి జిత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ‘‘కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే .. ఐపీఎస్‌లు పరుగులు పెట్టారంట .ఛీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయం. మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదు. సజ్జల కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం నడిపారు.ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలి.విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాద్ రెడ్డి, కాంతి రాణా టాటాలను అదుపులోకి తీసుకోవాలి. ఈ కేసుల్లో పాత్రధారులు, సూత్రధారులను ప్రాసిక్యూట్ చేయాలి ’’ అని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు. చివరకు ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహరించారన్నారు. అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com