ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భైరవాని తిప్ప ప్రాజెక్టు పనులు పూర్తి చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 12:34 PM

కళ్యాణదుర్గం మండలంలోని తిమ్మసముద్రం వద్ద ఉన్న ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అవసరమైన తాగు, సాగునీటిని అం దించే భైరవాని తిప్ప ప్రాజె క్టు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కోరారు. తిమ్మసముద్రం ప్రాంతంలోని ఏపీఐఐసీ భూములను పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్‌ను పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే కలిసి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను విన్నవించారు. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, తాగునీటి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com