ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ చెక్కుచెదరదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 09:45 AM

రాష్ట్రంలో చంద్రబాబు అతిపెద్ద రాజకీయ ఆషాడభూతి అని, నమ్మిన వారిని మోసం చేయడం ఆయనకు అలవాటు అని, అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదని గుర్తు చేశారు. ఇంకా ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటు అని, ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని, అది చూస్తుంటే ఆయనపై జాలి కలుగుతోందని అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కుచెదరదని, తమ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌గారిని ఏమీ చేయలేరని పేర్ని నాని స్పష్టం చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com