ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూటుగా మద్యం తాగివచ్చి గొడవ.. భర్త మర్మాంగాన్ని కోసేసిన రెండో భార్య..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 05:01 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త పెట్టే వేధింపులకు భరించలేక అతని రెండో భార్య.. భర్త మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భర్తని ఒంగోలు నగరంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయ్ యాదవ్ గతకొద్ది కాలంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో ఓ పశువుల డైరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే డైరీ ఫామ్ లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన సీతా కుమారి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విజయ్ యాదవ్‌కు ఇదివరకే వివాహం కాగా అతడి భార్య బీహార్‌లోని సొంత ఊరిలోనే ఉంది. సీతతో వివాహేతర సంబంధం కొనసాగించి రెండో పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి చేసుకున్న తర్వాత సీత గర్భం దాల్చింది. గర్భవతి అయిన తర్వాత విజయ్ ఆమెను పట్టించుకోవడం లేదన్న కారణంగా తరచూ అతనితో గొడవపడేది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి సమయంలో మద్యం తాగి వచ్చిన విజయ్ యాదవ్‌కు సీతాకుమారికి మద్య గొడవ జరిగింది. దీంతో రెండో భార్య సహనం కోల్పోయి కత్తితో భర్తపై దాడి చేసింది. ఈ దాడిలో భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. కానీ దాడిలో తీవ్రంగా గాయపడ్డ భర్తని చూసి భయంతో డైరీ ఫార్మ్ యాజమానికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది.డైరీ ఫామ్‌ యజమాని వచ్చేలోపే అక్కడ నుంచి ఆమె పరారైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న భార్య సీతా కుమారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com