విజయనగరం జిల్లా, గుర్ల మండలంలోని గుర్ల గ్రామానికి చెందిన బోడసింగి సన్యాసి నాయుడు(43) మద్యం మత్తులో మృతిచెందినట్లు శుక్రవారం పోలీసులు గుర్తించారు. గుర్ల గ్రామానికి చెందిన బోడసింగి సన్యాసినాయుడుకు గోశాడ గ్రామానికి చెందిన సత్యవతితో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. మద్యానికి బానిస కావడంతో భార్య భర్తల మధ్య నిత్యం గొడవలు సాగుతున్నాయి. వీరి వివాదం పోలీస్స్టేషన్ వరకూ చే రింది. పెద్దలు ఇరువురినీ ఒప్పించే ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం సన్యాసినాయుడు ఇంటిదగ్గర కనిపించకుండా మద్యంమత్తులో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు వెతుకుతున్నప్పటికీ ఆచూకీ దొర కలేదు. ఈ క్రమంలో శుక్రవారం విశాఖ గ్రామీణ బ్యాంకు మేడమీదపై నుంచి దుర్వా సన రావడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు లు పరిశీలించి నాలుగురోజుల క్రితమే మద్యం ఎక్కువై చనిపోయి ఉండవచ్చని భావి స్తున్నారు. మృతునికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.