విజయనగరం జిల్లా కేం ద్రంలో చోరీలకు పాల్పడుతున్న నిందితు డిని ఎట్టకేలకు వన్టౌన్ పోలీసులు అరె స్టు చేశారు. అతనిపై 70 కేసులు ఉన్న ట్టు గుర్తించారు. పోలీసుల కథనం మే రకు వివరాలివీ.. బాలాజీ నగర్లోని ఇం దూ రెసిడెన్షియల్లో ఈ నెల 10న ఇంట్లోని వెండి వస్తువులు, 12న శ్రీనివాసా కళాశాల సమీపంలోని ఒక ఇంట్లో రూ.లక్ష విలువైన వాచీ, కొంత నగదు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేర కు నగరంలోని లాడ్జీలను, వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో తె లంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా కొండ పాక మండలం తట్టుపోతల బంగారం గ్రామా నికి చెందిన దుద్దెడ లింగం అనే వ్యక్తి ని శుక్రవారం రైల్వే స్టేషన్ సమీపంలో అదుపు లోకి తీసుకున్నారు. అతనిని విచా రించగా, దొంగతనాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.లక్ష వి లువైన వాచీ, ఇయర్ ప్యాడ్స్, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిపై 70కి పైగా కేసులు ఉన్నాయని వెల్లడించారు. చాలా కేసుల్లో శిక్ష అనుభవించాడన్నారు. ఐదు నెలల క్రితం జైలు నుంచి బయటకు వచ్చి దొంగతనాలు చేస్తూ మళ్లీ పట్టుబడ్డాడు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహ రించిన క్రైం ఎస్ఐ తారకేశ్వరరావు, హెచ్సీ అచ్చి రాజు, పీసీ గౌరీశంకర్, సిబ్బందిని డీఎస్పీ గోవిందరావు అభినందించారు.