చికిత్సపొందుతూ వృద్ధుడి మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా, నందిగాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మదనాపురం గ్రామానికి చెందిన భద్రాచలం ముకుందరావు (75) గురువారం రాత్రి మద్యం మత్తులో నీళ్లు తాగబోయి గడ్డిమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయాన్ని గుర్తించిన భార్య ఆరుద్ర స్థానికుల సాయంతో టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముకుందరావు మృతి చెందాడు. ఇద్దరు వివాహమైన కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహ్మద్ అమీర్ ఆలీ కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని శుక్రవారం కుటుంబసభ్యులకు అప్పగించారు.