ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయటపెట్టాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 11:12 PM

చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి పాలించే సత్తాలేక వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తుంద‌ని మాజీ మంత్రి పేర్ని నాని మండిప‌డ్డారు.  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేక పోతోందని.. ప్రజల బాగోగులు వదిలేసి ఆయనపై అభాండాలు వేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. బుధవారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వైయ‌స్ జ‌గ‌న్ ‘‘రూ.3.63 కోట్లతో ఎగ్‌పఫ్‌లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయటపెట్టాల‌ని పేర్ని నాని సవాల్‌ విసిరారు. మూడు పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను, వారి బాగోగులను గాలికొదిలి… జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారంతో విషం చిమ్ముతోందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రాయమయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నారు. తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలడంతో పాటు, వాళ్ల జీతగాళ్లతో రక,రకాల తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారని నాని మండిపడ్డారు. ఐదేళ్లలో వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రూ.3,62,56,700 ఎగ్ పఫ్లు తిన్నారని ఊరూపేరులేని పోస్టర్లుతో విషప్రచారం చేస్తున్నారన్నారు. మీ జీతగాళ్లతో ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే బదులు జీఏడీ చూస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబే కాబట్టి.. ఈ విషయం నిజమైతే బయటపెట్టాలని సవాల్ చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే జీఏడీ మంత్రి హోదాలో ఈ ఖర్చు పెట్టినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com