ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.6 లక్షలకే కొత్త కారు.. ఆపై రూ.82 వేల డిస్కౌంట్

business |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 11:03 PM

భారత్‌లో ఎస్‌యూవీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవలి కాలంలో ఎక్కువగా ఎస్‌యూవీలనే కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది 2024 తొలి అర్ధభాగంలో చూసుకుంటే దేశీయ కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీ కార్లదే 52 శాతం వాటా ఉండడం గమనార్హం. మీరు కూడా మంచి ఎస్‌యూవీ కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకో మంచి డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ అదిరే ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆగస్టులో భారీ డిస్కౌంట్లు కల్పిస్తోంది.


నిస్సాన్ కంపెనీకి చెందిన పాపులర్ ఎస్‌యూవీ మోడల్ మ్యాగ్నైట్ ఆగస్టు ఆఫర్స్ ప్రకటించింది. హెచ్‌టీ ఆటో కథనం ప్రకారం.. మీరు ఈ ఆగస్టు 2024 లో నిస్సాన్ మ్యాగ్నైట్ ఎస్‌యూవీ కారు కొనుగోలు చేసినట్లయితే మీకు గరిష్ఠంగా రూ.82,600 వరకు డిస్కౌంట్ పొందేందుకు అవకాశం ఉంది. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ కలిసి ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ కారు కొనుగోలు చేయాలనుకునే వారు తమ సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.


నిస్సాన్ మ్యాగ్నైట్ కారులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ఉంటుంది. 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ ఉంటాయి. కారు లోపలి భాగంలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కారు ప్లేకనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 72 బీహెచ్‌పీ గరిష్ఠ పవర్ జనరేట్ చేస్తుంది. అలాగే 96 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.0 టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది గరిష్ఠంగా 100బీహెచ్‌పీ పవర్ జనరేట్ చేస్తుంది. 160 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉంది. నిస్సాన్ మ్యాగ్నైట్ ఎస్‌యూవీ ప్రారంభ మోడల్ ధర రూ.6 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 11.27 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com