ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాస్టర్స్‌ అసోసియేషన్‌ కి నూతన కార్యవర్గం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 08:52 PM

పలాస నియోజకవర్గ పాస్టర్స్‌, లీడర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు రెవరెండ్‌ సి.కృపానందం, రాష్ట్ర క్రైస్తవ సంఘ నాయకులు డీవీడీవీకుమార్‌ (బోస్‌బాబు) తెలిపారు. సోమవారం కాశీబుగ్గ తిలక్‌నగర్‌లో ఎరుష లేము ప్రార్థనా మందిరంలో సంఘ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా బిషప్‌ ఎస్‌.సుందర్‌ సింగ్‌, కార్యదర్శిగా సూరాడ యాకోబు, కోశాధికారిగా ఎస్‌.చిరంజీవులను ఎన్నుకున్నామన్నారు. అలాగే పలాస కాశీబుగ్గ టౌన్‌ ఫెలొషిప్‌ అధ్యక్ష, కార్యదర్శులుగా కూను జోసెఫ్‌, సుందర్‌సింగ్‌, కోశాధికారిగా అమ్మాల కిరణ్‌కుమార్‌లను నియమించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com