ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో గర్భవతి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 08:50 PM

తీవ్ర అనారోగ్యానికి గురైన పొందూరు పరిధిలోని వీఆర్‌గూడెం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త కె.స్వప్న (25) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఐదు నెలల గర్భవతి అయిన స్వప్న తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో సోమవారం చేర్పిం చారు. శిశువు పెరుగుదలలో లోపం కారణంగా అబార్షన్‌ కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి స్వప్న మృతి చెందింది. స్వప్నకు భర్త అసిరినాయుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. స్వప్న మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com