ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోగి రమేష్ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 04:47 PM

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ వ్యవహారంతోపాటు మరిన్ని అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. అధికారం ఉన్నప్పుడు అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇప్పుడు బుకాయిస్తున్నారని మండిపడ్డారు. అడ్డంగా దొరికిపోయిన జోగి రమేశ్ ఇప్పుడు కులప్రస్తావన తెస్తూ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహించారు. ఈ నేపథ్యంలోనే భూ అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని మంత్రి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com