ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురటిలోనే మగశిశువు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 04:23 PM

శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం పట్టణంలో గల ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం వల్లే అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందినట్టు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆ ఆసుపత్రి ఎదుట మృతి చెందిన పసికందుతో ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం పట్టణానికి చెందిన శివప్రసాద్‌కి ఇచ్ఛాపురం పట్టణ పరిధి కృష్ణానగర్‌కు చెందిన త్రివేణి మహంతితో వివాహం జరిగింది. డెలివరీ కోసం కన్నవారి ఇంటికి వెళ్లింది. ఈ క్రమం లో ఇచ్ఛాపురం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లో ప్రతీ నెలా చూపించేవారు. పదో నెల వచ్చినా డెలివరీ కాకపోవడంతో మంగళవారం ఆ నర్సింగ్‌హోమ్‌లో చేర్పించారు. పురిటి నొప్పులతో బాధపడుతున్నా అక్కడి వైద్యుడు పట్టించుకోకపోవడం తో బుధవారం పురటిలోనే మగశిశువు మృతి చెందింది. దీంతో ఆగ్రహంతో బంధువు లు ఆ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com