ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వారందరికి ,,, ఒక్కొక్కరికి రూ.20వేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 09:50 PM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం త్వరలో మరో హామీని నెరవేరుస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. వర్మ మూలపేట తీరప్రాంతంలో మత్స్యకారులతో సమావేశం అయ్యారు. తీరప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ సాయం మంజూరు చేస్తుందని తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో పరిహారం చెల్లించి ఆదుకోవాలన్న ఆలోచన చేసినది టీడీపీ అన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ వేట నిషేధ సాయం రూ.20వేలుగా ప్రకటించారని వర్మ గుర్తు చేశారు. త్వరలో మత్స్యకారులకు పరిహార సాయం అందజేస్తారని తెలిపారు. అలాగే పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి అప్పులు చేయకూడదని కూటమి ప్రభుత్వం రూ.3 నుంచి 4లక్షల హౌసింగ్‌ లోన్లు మంజూరు చేస్తుందన్నారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు వర్మ.


వైఎస్సార్‌సీపీ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు వర్మ. వైఎస్సార్‌సీపీ నేతలు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ దళితుల పథకాలను లేకుండా చేసిందని.. అలాంటి వారు అంబేద్కర్‌పై ప్రేమ ఉన్నట్టు నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం దళితులపై ప్రేమ ఉంటే దళితుల పథకాలు ఎందుకు దూరం చేశారో చెప్పాలన్నారు. గత ఐదేళ్లు దళితులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలని ప్రశ్నించారు. వంగా గీత ఎంపీగా ఉన్న సమయంలో పిఠాపురం నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. అమావాస్యకి, పౌర్ణమి వచ్చి కార్యక్రమాలు చేశారని.. అలాంటిది ఇప్పుడు ఆమె కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు.


ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. ఆదివాసీ మహిళలతో కలిసి చంద్రబాబు నృత్యం


గతంలో చంద్రబాబు అమరావతి రాజధానిలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేశారన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. దీనికి సంబంధించిన భారీ విస్తీర్ణంలో ప్రపంచంలోనే లేని ఎత్తైన విగ్రహాంతో పాటు బాల్యం, విద్యాభ్యాసం, ఆయన పడిన కష్టం, పడిన వివక్షత.. రాజ్యాంగానికి సంబంధించినవి అన్ని పొందుపరిచే విధంగా ఏర్పాటు చేయాలని అనుకున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహం భావితరాలకు గుర్తుండే విధంగా తీర్చిదిద్దాలని అనుకున్నారని.. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తక్కువ విస్తీర్ణంలో విజయవాడలో పెట్టారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com