ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంటువ్యాధులు ప్రబలిళ్లకుండా జాగ్రత్తలు వహించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 03:24 PM

అంటువ్యాధులు లేకుండా నిర్మూలిద్దామని తూర్పు గోదావరి కలెక్టర్‌ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజనోత్సవంలో భాగంగా తూర్పు గోదావరి కలెక్టరేట్‌లో సోమవారం హెచ్‌ఐవీపై మీకోసం చైతన్యం,డీ వార్మింగ్‌ డే కార్యక్రమాల పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. సోమవారం నుంచి అక్టోబరు 13వ తేదీ వరకు 8 వారాల పాటు హెచ్‌ఐవీపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆగస్టు 20న డీవార్మింగ్‌ డేను పురస్కరించుకుని అన్ని పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్నభోజన సమయంలో అల్బెండాజోల్‌ మాత్రలు వేసుకునేలా చూడాలన్నారు. ఈ రెండు కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. ఈ నెల 28న మరోసారి మిగిలిన పిల్లలకు అల్బెండాజోల్‌ మాత్రలు అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ళ వయస్సు కలిగిన వారు 4,30,339 మంది ఉన్నట్టు తెలిపారు. హెచ్‌ఐవీ ప్రభావం తక్కువగా ఉన్నప్పటికి జిల్లాలో కేసుల నమోదు ఎక్కువగా ఉందన్నారు. దేశంలో 2030 నాటికి హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ , ఇతర అంటువ్యాదులను అంతం చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలిపారు. 1097 హెచ్‌ఐవీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ అన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి జేసీ జి.నరసింహులు, డీఎంహెచ్‌వో కే.వెంకటేశ్వరరావు, ఎన్‌.వసుంధర తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com