ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యా కమిటీ ప్రతినిధులుతో సమావేశమైన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 04:34 PM

పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. పాతపట్నం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు పాఠశాలలకు ఎన్నికైన విద్యా కమిటీ ప్రతినిధులు ఆదివారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెచ్‌ ఎంలు, ఉపాధ్యాయులతో సమన్వయంగా వ్యవహరించి పాఠశాలల్లో దీర్ఘ కాలిక ప్రయోజనం కలిగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పాఠశాలల పర్యవేక్షణలో ఉపాధ్యాయులతో స్నేహభావంతో మెలగాలన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్లను ఆయన అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com