పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఐటీడీఏలో గిరిజన మహిళ సవర తులసితో చంద్రబాబు వర్చువల్గా మాట్లాడారు. చిరుధాన్యాలు సాగు చేస్తున్నామని, గిరిజన సంప్రదాయాల ప్రకారం జీవనం సాగిస్తున్నామని ఆమె తెలిపారు. సీతంపేట మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరగా అయ్యేలా చూడాలని కోరారు. ఆమె కోరినవన్నీ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.7కోట్లతో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటుచేస్తామని తెలిపారు. కాగా, ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏలో అడవితల్లి విగ్రహానికి పాలభిషేకం చేశారు. చీరలు,గాజులు, పసుపు, కుంకుమ సమర్పించారు. విద్యార్థులు థింసా నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.