ముదినేపల్లిలో గురువారం అదృశ్యమైన కోన మహాలక్ష్మి భవాని (32) అనే వివాహిత ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తన భర్తతో మనస్పర్థల కారణంగా లక్ష్మీభవాని ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ముదినేపల్లిలో సీసీ ఫుటేజ్లు పరిశీలించగా, ఆమె పోలీస్ స్టేషన్ పక్క నుంచి ఆర్టీసీ బస్ స్టేసన్లోకి వెళ్లి విజయవాడ బస్ ఎక్కినట్టు తెలుసుకున్నారు. వెంటనే ఎస్ఐ వెంకట్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విజయవాడ ఆర్టీసీ బస్ స్టేషన్కు వెళ్లి అక్కడి సీసీ ఫుటేజ్లను పరిశీలించగా, గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు బస్ స్టేషన్లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పరిసరాల్లో లక్ష్మీ భవాని ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. బస్ స్టేషన్ నుంచి ఆమె ఎక్కడికి వెళ్లిందనేది ఆరా తీస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు లక్ష్మీభవానీ ఒక లెటర్ రాసి ఇంటిలో పెట్టింది. లెటర్ సారాంశం చూస్తే ఆమె జీవితంపై విరక్తి చెందినట్లు అర్థమ వుతోంది. ఏడేళ్ల కుమార్తె ధన్విని జాగ్రత్తగా చూసుకుంటూ విద్యా బుద్ధులు నేర్పించాలని తన తల్లి లక్ష్మీని ఉద్దేశించి లక్ష్మీభవాని ఆ లెటర్లో రాసింది. కుమార్తె ధన్విని ఉద్దేశించి కూడ బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకో అమ్మా అంటూ రాసింది. తాను జీవితంపై విరక్తి చెంది వెళ్లిపోతున్నానని స్పష్టంగా పేర్కొంది. పోలీసుల దర్యాప్తులో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2015లో నెల్లూరుకు చెందిన కోన నాగార్జునతో లక్ష్మీభవానికి వివాహమైంది. నాగార్జున అప్పట్లో బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. కొంతకాలం తర్వాత ఉద్యోగం మానేసి ముదినేపల్లి వచ్చి రొయ్యల చెరువులు సాగు చేసి అప్పుల పాలయ్యా డు. భార్య లక్ష్మీభవాని పేరిట అప్పులు చేశాడు. అప్పు తీర్చాలని ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో భార్యాభర ్తల మధ్య మనస్పర్థలు పెరిగిన నేపథ్యంలో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది.